Telugu Daily News
దుండిగల్ పరిదిలోని ఓఆర్ఆర్ ఎక్జిట్ 5 వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ – కారు ఢీ..ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్థులు మృతి

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: రోడ్డుపై ఆగిఉన్న లారీని అతివేగంతో ఢీకొట్టిన స్కోడా కార్ దీంతో కార్ లో ఉన్న వీఎన్ఆర్ కాలేజి కి చెందిన ముగ్గురు బిటెక్ విద్యార్థులు అక్కడికక్కడే
మృతి చెందగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను నారాయణ మల్లారెడ్డి హస్పిటల్ కు తరలించారు. కారు అతి వేగమే ప్రమాదానికి కారణం అని తెలిపిన పోలీసులు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్న పోలీసులు.పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



