Telugu Daily News
ఈ జిల్లాల్లో మరికొన్ని గంటల్లో వర్షం!

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో సోమవారం కాస్త తగ్గిన వర్షం మంగళవారం మళ్లీ మొదలైంది. హైదరాబాద్లో ఉదయం నుంచి చిరుజల్లులు పడుతున్నాయి. అయితే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 3 గంటల్లో మోస్తరు వానలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఈరోజు సాయంత్రం తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, మహబూబ్నగర్, నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడనున్నాయని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు.



