Telugu Daily News
బాధితునికి ఎల్ ఓ సి అందజేత

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: మోకాళ్ళ వ్యాధితో బాధపడుతున్న
హుజురాబాద్ పట్టణానికి చెందిన గంగిశెట్టి రాజమౌళికి శస్త్ర చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి రూ.75 వేల రూపాయల ఎల్ఓసిని ఆదివారం కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి వొడితేల ప్రణవ్ అందజేశారు. తన శస్త్ర చికిత్సకు సహాయం చేసిన ప్రణవ్ బాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.


