01-09-2024 NORMAL NEWS 11:16 AM
swarnodayam.com
Telugu Daily News
01-09-2024 11:16 AM By Mandala Yadagiri

తాసిల్దార్ కార్యాలయం ముందు పెన్షనర్ల నిరసన

తాసిల్దార్ కార్యాలయం ముందు పెన్షనర్ల నిరసన
IMG-20240901-WA0105(1)

మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: సిపిఎస్ పెన్షన్ విధానాన్ని నిరసిస్తూ ఉద్యోగుల జేఏసీ పిలుపుమేరకు ఆదివారం హుజురాబాద్ తాసిల్దార్ కార్యాలయం ముందు పెన్షనర్లు నిరసన తెలిపారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, ఉద్యోగుల కోర్కెలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం తగదని పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్అన్నారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షులు చందుపట్ల జనార్ధన్, నాయకులు ఎండి మునీరుద్దీన్, మండల వీరస్వామి, పరాంకుశం సనత్ కుమార్, గొట్టే జమదగ్ని తదితరులు పాల్గొన్నారు.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!