20-09-2024 NORMAL NEWS 10:13 AM
swarnodayam.com
Telugu Daily News
20-09-2024 10:13 AM By Mandala Yadagiri

రేపటి నుంచి జిల్లాల వారీగా కాంగ్రెస్ సమావేశాలు

రేపటి నుంచి జిల్లాల వారీగా కాంగ్రెస్ సమావేశాలు
IMG-20240920-WA0312

స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి జిల్లాల వారిగా గాంధీ భవన్ లో ముఖ్య నాయకులతో సమావేశం కానున్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇన్ ఛార్జి దీప్ దాస్ మున్షీ. జిల్లాల వారీగా సమావేశంలో డీసీసీ అధ్యక్షులు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు ఇతర నాయకులు పాల్గొంటారు.

ఇటీవల రాజకీయ పరిమాణాలు, రైతు భరోసా, రుణమాఫీ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, అమలు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తుంది. రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వరంగల్ జిల్లా, మధ్యాహ్నం రెండు గంటల నుంచి 4 గంటల వరకు కరీంనగర్ జిల్లా, 4 గంటల నుంచి 6 గంటల వరకు నిజామాబాద్ జిల్లా సమావేశాలు జరగనున్నాయి.

Reporter

  • Working as a Journalist for the past 30 years in various Telugu Daily News Papers

error: Content is protected !!