
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్ : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధిష్టానం ఆదేశానుసారం హుజురాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని హుజురాబాద్ పట్టణంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని హుజురాబాద్ అసెంబ్లీ ఇంచార్జ్ అయిత హరీష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదుకు కార్యకర్తలు సహకరించాలని పిలుపు నిచ్చారు. ఈ సందర్బంగా నూతనంగా చేరిన కార్యకర్తలను అభినందించారు. టిఎన్ ఎస్ ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పర్లపల్లి రవిందర్ మాట్లాడుతూ ప్రతీ కార్యకర్త వంద రూపాయల తో సభ్యత్వం తీసుకోవాలని తద్వారా 5 లక్షల బీమా సౌకర్యంను పార్టీ కల్పించిందని తెలిపారు. టీడీపీ జిల్లా మాజీ పార్లమెంటు ఉపాధ్యక్షుడు ఎస్ కె ఫయాజ్ మాట్లాడుతూ భవిష్యత్తులో చనిపోయిన కార్యకర్తల మట్టి ఖర్చుల క్రింద తక్షణ సహాయంగా 10 వేలు టీడీపీ పార్టీ అందచేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నాయకులు ఇల్లందుల రమేష్, వర్దినేని లింగరావు, సిమ్మసర్ధి శివ, బత్తిని సంజీవ్, ఆడెపు రవీందర్, రమేష్, గరిగె స్వామి, ఎండి ఆఫ్రిద్ పలువురు పాల్గొన్నారు.
