
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, కరీంనగర్ (ఓదెల) నవంబర్ 17 : ఓదెల మండల కేంద్రంలో వివిధ కారణాలతో మరణించిన కుటుంబాలకు ఓదెల మల్లికార్జున స్వామి దేవస్థాన మాజీ ధర్మకర్త డా. సతీష్ బియ్యం వితరణ చేశారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన గాండ్ల ప్రశాంత్ కుటుంబానికి, అనారోగ్యంతో మరణించిన కొండ్ర లస్మవ్వ కుటుంబ సభ్యులకు చెరో 50 కేజీల బియ్యాన్ని ఓదెల మల్లికార్జున స్వామి దేవస్థాన మాజీ ధర్మకర్త డా. సతీష్ అందజేశారు.ఈ కార్యక్రమంలో కుమార్, మల్లయ్య, కొండ్ర రాంచేంద్రం, రాజేశం, కుమారస్వామి, రాచెర్ల రాజేశం తదితరులు పాల్గొన్నారు.
