
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: శంకరపట్నం మండలం మెట్టుపల్లి గ్రామంలో హుజురాబాద్ మండలం సింగపూర్ గ్రామానికి చెందిన జయన్న ఫౌండేషన్ వ్యవస్థాపక నిర్వాహకుడు గుడిపాటి సరిత జైపాల్ రెడ్డి ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయగా చక్కని శోధన లభించింది. ఈ వైద్య శిబిరానికి మెట్ల్పల్లి గ్రామ ప్రజలతోపాటు ఆముదాలపల్లి, బేతిగల్, లింగాపూర్, ఇప్పల్ నర్సింగాపూర్, ఆమనగుర్తి,, భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం నుండి సుమారుగా 300 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. 080 మందికి నేత్ర వైద్య శస్త్ర చికిత్స కోసం హైదరాబాదులోని నానక్ రామ్ గూడా వద్దగల శంకర నేత్ర వైద్యాలయంలో కంటి శస్త్ర చికిత్సలు చేయిస్తామని సరిత జైపాల్ రెడ్డి తెలిపారు.







