
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మున్సిపల్ కు నూతనంగా వచ్చిన కమీషనర్ కే సమ్మయ్యని తాజా మాజీ చైర్పర్సన్ దంపతులు గందే రాధిక శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా ఆయనకు శాలువా కప్పి, జ్ఞాపిక అందజేసి సత్కరించారు.
పట్టణ అభివృద్ధిలో సంక్షేమ పథకాలలో పారదర్శకంగా ఉండి ప్రజా సమస్యలు పరిష్కరించాలని సూచించారు. వారి వెంట పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.
