
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజూరాబాద్ మండలం చెల్పూర్ గ్రామంలో పుల్ల ఫ్యామిలీస్ ఆద్వర్యంలో బుధవారం మంద కృష్ణ మాదిగ లక్ష డప్పులు వేయి గొంతుల పిలుపు మేరకు పది వేల రూపాయల విలువ చేసే 15 డప్పులను పంపిణీ చేశారు. ప్రముఖ సినీ గేయ రచయిత, నంది అవార్డు గ్రహీత మిట్టపల్లి సురేందర్ మరియు ఆల్ ఇండియా యూనివర్సిటీ ఎంప్లాయీస్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ పుల్ల శ్రీనివాస్ చేతుల మీదుగా 15 మంది డప్పు కళాకారులకు డప్పులను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యమములో పుల్ల రామస్వామి, పుల్ల రాధ, పుల్ల వెంకన్న, పుల్ల శ్రావణ్, పుల్ల రమేష్, పుల్ల పద్మయ్య, పుల్ల సుదర్శన్, పుల్ల ఏసు, పుల్ల పవన్ కుమార్, పుల్ల లక్ష్మీ, పుల్ల వర్షిత్, పుల్ల శ్రీకాంత్, జూపాక వీర స్వామి (టీచర్), జూపాక సామేల్, డప్పు కళాకారుల సంఘం టీం లీడర్ మొల్గూరి రాజయ్య, శనిగరం(లొట్ట)సారయ్య మరియు తదితరులు పాల్గొన్నారు.



ప్రముఖ సినీ గేయ రచయిత, నంది అవార్డు గ్రహీత మిట్టపల్లి సురేందర్ మరియు ఆల్ ఇండియా యూనివర్సిటీ ఎంప్లాయీస్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ పుల్ల శ్రీనివాస్