
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకట రమణ ఆకస్మికంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చెల్పూర్ ను సందర్శించారు. డాక్టర్ వెంకటరమణ మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో సాధారణ ప్రసవాలు జరిపించాలని, ఆయుష్మాన్ భారత్ కార్యక్రమం కింద అభ కార్డు జనరేట్ చేయాలని, దీర్ఘకాలిక వ్యాధులైన హైపర్టెన్షన్ డయాబెటిస్ పేషెంట్లనులను గుర్తించి వారికి పరీక్షలు చేసి సకాలంలో చికిత్స అందాలని చెప్పారు. వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా వ్యాధులు ప్రభలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంటింటికి జరపీడుతులున్న సర్వే చేయాలని చెప్పారు. సిబ్బంది పని వేళలు పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ మధుకర్, జిల్లా హెల్త్ ఎడ్యుకేటర్ పంజాల ప్రతాప్, విజేందర్రెడ్డి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



———————–++++++——————
&పత్రికా ప్రకటనలు (యాడ్స్) &
———————-+++++———————–
#వార్షికోత్సవ శుభాకాంక్షలు#






