
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ :
హుజురాబాద్ మండలo సింగపూర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు మంగళవారం నోటు బుక్కులు, పెన్నులు, కంపాస్ బాక్స్ లు పంపిణీ చేశారు. కాగా వీటిని అలయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో పోపా జిల్లా అధ్యక్షులు పోలు సత్యనారాయణ అందించగా మండల విద్యాధికారి విడపు శ్రీనివాస్ ప్రాథమిక పాఠశాలలోని 45 మంది విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం మాడ్గుల సుధీన, ఏం మమత, శాంతి, పి శాంతిలత, సిఆర్పి రంగు దామోదరచారి తదితరులు పాల్గొన్నారు.
@లోకల్ యాడ్స్@
స్వర్ణోదయం డిజిటల్ పేపర్, యూట్యూబ్ ఛానల్ కు ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు.

శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు: కేరళ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ హుజురాబాద్, కరీంనగర్ జిల్లా.





