
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్:
పట్టణ బద్రుల ఎమ్మెల్సీ వోటింగ్ సందర్భంగా పోలింగ్ పరిశీలనలో భాగంగా కాజీపేట 62 వ బూత్ వద్దకు వచ్చి పోలింగ్ సరళిని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలతో మాట్లాడి పోలింగ్ సరలీని అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనతి కాలంలోనే ప్రజావ్యతిరేకతకు గురైందని, అందుకని ఎమ్మెల్సీగా రాకేష్ రెడ్డి ఘనవిజయం ఖాయమని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆయన వెంట బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రావుల రాజలింగారెడ్డి, వర్డినేని రవీందర్ రావు తదితర నాయకులు ఉన్నారు.







