
స్వర్ణోదయం ప్రతినిధి, ములుగు:
ములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాధపురం గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు అడవికి కట్టెల కోసం వెళ్లారు. మావోయిస్టులు భూమిలో అమర్చిన ప్రెజర్ బాంబును గమనించక అందులో ఇల్లందుల ఏసు (50)అనే వ్యక్తి మావోయిస్టలు అమర్చిన ప్రెజర్ బాంబు తొక్కి ఒక్కసారిగా పేలిపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు అప్రమత్తమై అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్నారు.
