
స్వర్ణోదయం ప్రతినిధి, అమరావతి:
చంద్రబాబు కోసం అతిరథ మహారథులంతా ఏపీకి తరలి వచ్చారు. తెలుగు స్టేట్స్ నుంచే కాదు దేశ నలుమూలల నుంచి వీవీఐపీలు కేసరపల్లికి క్యూకట్టారు. దేశ ప్రధాని నరేంద్రమోదీ మొదలు కేంద్ర హోంమంత్రి అమిత్, బీజేపీ చీఫ్ అండ్ సెంట్రల్ మినిస్టర్ జేపీ నడ్డా, కిషన్ రెడ్డి, బండి సంజయ్ లతో పాటు సినిమా రంగం నుంచి మెగాస్టార్ చిరంజీవి మొదలు తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రిటైర్డ్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ, ఒకరా ఇద్దర వందలమంది వీవీఐపీలు, అతిరథ మహారథులు.. చంద్రబాబు ప్రమాణస్వీకార మహోత్స వంలో పాల్గోన్నారు. వారితోపాటు నారా, నందమూరి కుటుంబాలు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం అనంతరం చంద్రబాబు ఇచ్చిన ప్రత్యేక విందులో పాల్గొన్నారు.

