
స్వర్ణోదయం ప్రతినిధి, అమరావతి:
ఏపీ సీఎంగా చంద్రబాబునాయుడు గురువారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు మెగా డీఎస్సీపై ఆయన తొలి సంతకం చేశారు. అనంతరం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, రూ.4వేలకు పింఛన్ పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన ఫైళ్లపై మొత్తం 5 సంతకాలు చేశారు. అంతకుముందు ఆయన, సతీమణి భువనేశ్వరితో కలిసి సచివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు వివిధ శాఖల కార్యదర్శులు, డిజిపి, ఇతర ఉన్నతాధికారులు, మంత్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
