
స్వర్ణోదయం ప్రతినిధి, అమరావతి:
ఆంధ్ర ప్రదేశ్లో కొత్త ప్రభుత్వానికి సంబంధించిన పనులు శరవేగంగా జరిగి పోతున్నాయి. ఈ నెల12 వ తేదీన ఆంధ్ర రాష్ట్ర ముఖ్య మంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ నెల 19 నుండి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయించింది. తొలిసారి నిర్వహించనున్న ఈ సమావేశాలకు ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి హాజరవుతారో లేదోనని ఆంధ్రాలో ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
