
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వొడితల ప్రణవ్ ఆదేశాల మేరకు ఈరోజు సోమవారం హుజురాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్సార్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు అందించిన సేవలను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ మండల మరియు పట్టణ కాంగ్రెస్ నాయకులు, మహిళా నాయకురాల్లు పాల్గొన్నారు.






