
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్, ఆగష్టు 24:- కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా రాష్ట్ర నాయకుడు గాలి రాకేష్ తన పుట్టినరోజు సందర్భంగా శనివారం తెలంగాణ రాష్ట్ర తోలి ముఖ్యమంత్రి, కేసీఆర్ ని ఎర్రవెళ్లి ఫాం హౌస్ లో కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. అంకితభావంతో పార్టీ అభివృద్ధి కోసం పనిచేసే కార్యకర్తలకు భవిష్యత్తులో మంచి అవకాశాలు కలిసి వస్తాయని, సోషల్ మీడియా వారియర్ గా నిర్భయంగా ముందుకు సాగాలన్నారన్నారు. నిండా నూరేళ్లు జీవించాలని రాకేష్ ను తొలి సీఎం కేసీఆర్ ఆశీర్వదించారన్నారు.

