
Oplus_0
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: టిఆర్ఎస్ వై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హుజురాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లె గ్రామానికి చెందిన రావుల రాజలింగారెడ్డి జన్మదిన వేడుకలు హుజురాబాద్ క్లబ్బులో, స్వగ్రామంలో శుక్ర, శనివారం ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చేత జన్మదిన కేక కట్ చేయించి ఆయనకు కేకులు స్వీట్లు తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాజలింగారెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకలు నిండా నూరేళ్లు జరుపుకోవాలని, ఆ భగవంతుడు అష్టైశ్వర్యాలు కల్పించాలని ఆకాంక్షించారు. ఆయన జన్మదిన వేడుకల్లో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్, పార్టీ రాష్ట్ర నాయకులు, సామాజిక వేత్తలు వర్ధినేని రవీందర్ రావు, సొల్లేటి కిషన్ రెడ్డి, లారీ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండి సలీం, నాయకులు బత్తుల సమ్మయ్య, సంపంగి రాజేందర్, కత్తెరమల్ల సదానందం, నీరటి రమేష్, చిట్టెంపల్లి సృజన్, జే కే సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


