Oplus_0
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండలం చెల్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం గ్రామపంచాయతీ మల్టీపర్పస్ వర్కర్స్ కు హెల్త్ చెకప్ చేయడం జరిగింది. వీరందరికీ హెల్త్ కార్డులు ఇవ్వడం జరిగింది. ఐదు గ్రామపంచాయతీలకు చెందిన వారికి ఇక్కడ పరీక్షలు నిర్వహించారు. రేపటినుండి రోజువారీగా మండలంలోని మిగతా గ్రామపంచాయతీల వారికి ఇవ్వడం జరుగుతుందని ఎంపీడీవో సునీత తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సునీత, ఎంపీఓ సతీష్, గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్ ఎమ్మార్వో కనుకయ్య, పంచాయతీ కార్యదర్శి, వైద్యులు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.






