
Oplus_0
–ప్రకృతిని దేవతగా కొలిచే సంస్కృతి తెలంగాణది
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుస్నాబాద్, అక్టోబర్ 09:
ప్రకృతిని దేవతగా కొలిచే సంస్కృతి కేవలం తెలంగాణ ప్రజలకు మాత్రమే సొంతమని, ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి సంస్కృతి కనబడదని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గ ఆడపడుచులకు, ప్రజలకు సతీష్ కుమార్ సద్దుల బతుకమ్మ, విజయదశమి దసరా శుభాకాంక్షలను తెలిపారు. బతుకమ్మ, గౌరమ్మ, దుర్గామాతల దీవెనలతో హుస్నాబాద్ నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు.
