
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్ అక్టోబర్ 14: కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా నియమితులైన సత్తు మల్లయ్య సోమవారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కరీంనగర్ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణరావు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని సత్తు మల్లయ్యకు శుభాకాంక్షలు తెలిపారు.
