Oplus_131072
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్: నవంబర్ 4 నుంచి తెలంగాణ ప్రభుత్వం కులగణన చేపట్టనుంది. 80వేల మంది ఎన్యుమరేటర్లు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరిస్తారు. ప్రతి ఎన్యుమరేటర్ 150 ఇళ్లలో సర్వే చేయనుండగా, NOV 19 వరకు ఇది కొనసాగుతుంది. మొత్తం 7 పేజీలలో 54 ప్రశ్నలతో ఫార్మాట్ రూపొందించారు. ఆధార్, కుటుంబ సభ్యుల వివరాలు, చదువు, వృత్తి, ఆస్తులు, రిజర్వేషన్లతో పొందిన ప్రయోజనాలు, ధరణి, రాజకీయ నేపథ్యం, బ్యాంక్ ఖాతా సహా మరిన్ని వివరాలు సేకరిస్తారు.







