
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ పట్టణానికి చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, జైరెడ్డి ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు పోరెడ్డి శంతన్ రెడ్డి తన పుట్టిన రోజు వేడుకలను పేద పద్మశాలి కుటుంబ సభ్యుల మధ్య జరుపుకున్నారు. పట్టణములోని 22 వార్డులో గల బత్తుల ప్రకాష్- అన్నపూర్ణ కుటుంబము ఇంటికి వెళ్ళి వారి ఇంటిలోనే బర్త్ డే కేక్ కట్ చేసి శంతన్ రెడ్డి వారి పిల్లలకు కేకును తినిపించారు. ఈ సందర్బంగా 50కేజీల బియ్యాన్ని వారికీ వితరణ చేసారు. ఈ సందర్బంగా శంతన్ రెడ్డి మాట్లాడుతూ…సమాజంలో జన్మదినం, వివాహ దినోత్సవాల సందర్బంగా ప్రయోజనము చేకూర్చని కార్యక్రమాలకు వేలాది రూపాయలు ఖర్చు పెడుతున్నారని, పేదలకు చేయూత అందించే కార్యక్రమాలను చేపడితే ఆత్మతృప్తి దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమములో పద్మశాలి రాష్ట్ర ఐక్య వేదిక కార్యదర్శి కుడికాల సాయి, సీనియర్ జర్నలిస్ట్ అల్లి నరేందర్, పోరెడ్డి స్ఫూర్తి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

