
– హైడ్రా పేరుతో అధికారులు మితిమీరితే వారి డెడ్రా అవుతుంది
–క్రీడాకారులు అంటే నాకు ప్రాణం క్రీడలు అంటే నాకు గుండెకాయ
–నా క్రికెట్ ఆడే రోజులు మళ్లీ గుర్తుకొస్తున్నాయి
–హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: తనమీద కోపం కాంగ్రెస్ ప్రభుత్వానికి కోపం ఉంటే జైల్లో పెట్టిన పర్వాలేదని, పేదవాడి జోలికి వస్తే ఊరుకోనని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడికోసం రెడ్డి హెచ్చరించారు. ఆదివారం హుజురాబాద్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో జరిగిన రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు బహుమతి ప్రధాన ఉత్సవం సందర్భంగా ఆయన ముఖ్యఅతిథి హాజరై మాట్లాడారు. హుజురాబాద్ క్రీడాకారుల కోసం ఎంతో ఆలోచించి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఒప్పించి పదికోట్లు తీసుకువచ్చానని అన్నారు. ఏప్రిల్ 28 2023లో స్పోర్ట్స్ గ్రౌండ్ కు 10 కోట్ల రూపాయలకు టెండర్ కూడా ఇవ్వడం జరిగిందని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మినీ స్టేడియం కోసం అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రౌండ్ ఏర్పాటును అడ్డుకుందని, అభివృద్ధిని అడ్డుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం వస్తుందో అర్థం కావడం లేదన్నారు. క్రీడాకారులు అంటే తనకు ప్రాణం అని క్రీడలు తన గుండెకాయ అని అన్నారు. తాను ఒక క్రీడాకారుని అయినందుకు హుజురాబాద్ లో కూడా ఎంతో మంది క్రీడాకారులు ఎదగాలని ఉద్దేశంతో మినీ స్టేడియాన్ని ఏర్పాటు చేసేందుకు సకల ప్రయత్నాలు చేసినప్పటికీ కాంగ్రెస్ అడ్డుకుంటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏదైనా కోపం ఉంటే కోపం ఉంటే తనమీద తీర్చుకోవాలి తప్ప క్రీడాకారుల మీద కాదన్నారు. కొంతమంది జోకర్లు 10 కోట్ల రూపాయలను తాను తీసుకువస్తే కేవలం 10 లక్షలు ఇచ్చామని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. గ్రౌండ్ కు కేటాయించింది 10 లక్షలు కాదని 10 కోట్లను గుర్తించాలన్నారు. మినీ స్టేడియం కు అన్ని విధాల టెండర్ అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పని ఎందుకు ఆపుతుందో చెప్పాలన్నారు. కొంతమంది జోకర్లు వాకింగ్ ట్రాక్ కోసం పది లక్షల కేటాయించామని చంకలు గుద్దుకుంటున్నారని బీఆర్ఎస్ హయాంలో వాకింగ్ ట్రాక్ కోసం రెండు కోట్ల కేటాయించామన్నారు. హుజూరాబాద్ లో అద్భుతమైన గ్రౌండ్ ఏర్పాటు చేయాలని తాను కన్న కలలన్నీ కాంగ్రెస్ పార్టీ నీళ్లు చల్లింది అన్నారు. ప్రతి కీర క్రీడాకారునికి అన్న అంటే నేనున్నానని ఎప్పటికీ స్పందిస్తానని హామీ ఇచ్చారు. హుజురాబాద్ లో కూడా హైడ్రా పేరుతో ప్రతాపవాడ, కిందివాడకు సంబంధించి పరిశీలన జరిగినట్లు తెలుస్తుందని, హైడ్రా పేరుతో ఏదైనా పేదవాడి ఇంటిని కూలగొట్టాలని ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఎవరైనా అధికారులు అత్యుత్సాహంతో పేదవాళ్ల ఇళ్ల జోలికి వస్తే రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేననే విషయం మర్చిపోవద్దని అన్నారు. హైడ్రా పేరుతో అధికారులు మితిమీరితే తర్వాత వారి డెడ్రా అవుతుందని హెచ్చరించారు. హైడ్రా పేరుతో పేదవాడి ఇంటికి వచ్చి బెదిరిస్తే ఒక్క ఫోన్ కాల్ చేస్తే ఏ రాత్రి అయినా సరే వచ్చి మీతోనే అక్కడే పడుకుంటానని హామీ ఇచ్చారు. తన చిన్ననాటి నుంచి ఇదే మట్టి మైదానంలో ఆటలు ఆడుతున్నాం తప్ప టర్ఫ్ గ్రౌండ్లో ఆడేది ఎప్పుడు అని ఆయన ప్రశ్నించారు. హుజురాబాద్ లోని ప్రతి క్రీడాకారుడు మినీ స్టేడియం కోసం ప్రభుత్వాన్ని ఇక్కడి ప్రజాప్రతినిధులను నిలదీయాలని అన్నారు. క్రీడాకారులంతా మరింత ఎదగాలని ఆకాంక్షించారు. హాకీ జాతీయ క్రీడా అని దీంతో ఒలింపిక్స్ లో కూడా మెడల్ సాధించాలని ఆయన క్రీడాకారులను విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ , ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్, మున్సిపల్ చైర్ పర్సన్ గందె రాధిక శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, కౌన్సిలర్లు తాళ్లపల్లి శ్రీనివాస్, నాగార్జున డైరీ సిఎండి పుల్లూరి ప్రభాకర్ రావు, జయన్న ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు గుడిపాటి జైపాల్ రెడ్డి, సామాజికవేత్త వి రవీందర్ రావు, ప్రముఖ వ్యాపారి అనగోని శ్రీనివాస్ గౌడ్ తో పాటు పలువురు కౌన్సిలర్లు, సీనియర్ క్రీడాకారులు, హాకీ కోచ్ లు, పెద్ద సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు.







