
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
.మాదిగల ఉపకులాల. ఐక్యవేదిక ఆధ్వర్యంలో హుజురాబాద్ పట్టణంలో డిసెంబర్ చివరి లోపు మాదిగ. మాదిగ ఉపకులాల. ఆత్మీయ సమ్మేళనం హుజురాబాద్ లో ఏర్పాటు చేయడం జరిగిందని, మాదిగ మాదిగ ఉపకులాల ఐక్యవేదిక నాయకులు తెలిపారు. దీనిపై ఆదివారం సమీక్ష సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంకు దామోదరం రాజానరసింహ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రిని మరియు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణని ఇతర మాదిగ ఎమ్మెల్యేలను, మాదిగ చైర్మన్ లను, మాదిగ ప్రజా ప్రతినిధులను ఈ సమావేశానికి ఆహ్వానించాలని ఆత్మీయ సమ్మేళనను బ్రహ్మాండంగా నిర్వహించి మాదిగల సత్తా చూపాలని సమావేశం తీర్మానించినట్లు వారు తెలిపారు. ఈ సమావేశానికి ఎస్సీ సెల్ రాష్ట్ర కన్వీనర్ ఇమ్మడిదయాకర్,mif గౌరవ అధ్యక్షులు వేల్పుల రత్నం, సీనియర్ ఎమ్మార్పీఎస్ నాయకులు పోచంపల్లి సహదేవ్, mif ట్రెజరర్ మట్టెడ ప్రకాష్, ఏర్ర రాజు, మోర సతీష్, వేల్పుల ప్రభాకర్, మిడిదొడ్డి సుధాకర్, అంబాల రవీందర్, అరిఖిల్లా ఐలయ్య, ఇమ్మడి పవిత్రన్, తిప్పారపు భువనచందర్ తదితరులు పాల్గొన్నారు.
