
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: జాతీయస్థాయి అండర్ 14 గర్ల్స్ హాకీ టోర్నమెంట్ మధ్యప్రదేశ్ మండసూర్ లో తేదీ 9 డిసెంబర్ 2024 నుండి 13 డిసెంబర్ 2024 వరకు జరుగుతున్న హాకీ టోర్నమెంట్ కు తెలంగాణ రాష్ట్రం తరఫున హాకీ మేనేజర్ గా హుజురాబాద్ మండలం చెల్పూర్ గ్రామంలోని జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాలలో ఫిజికల్ డైరెక్టర్ గా చిరుత శ్రీనివాస్ పనిచేస్తూ మేనేజర్ గా ఎంపికయ్యారు. ఆయన ఎంపిక పట్ల హెచ్ఎం అనురాధ గారు మరియు ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేశారు.
