
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ డివిజన్ ప్రాంత జూనియర్ కళాశాలల విద్యార్థిని విద్యార్థులకు ఈనెల 20వ తేదీ శుక్రవారం రోజున హుజురాబాద్ లోని శ్రీ వాగ్దేవి డిగ్రీ కళాశాలలో గణిత పరీక్ష నిర్వహించడం జరుగుతుందని డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఏనుగు మహిపాల్ రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గణిత శాస్త్ర పితామహుడు శ్రీ శ్రీనివాస రామానుజన్ జయంతి ఉత్సవ వేడుకలలో భాగంగా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆసక్తి కలిగిన వారు సెల్: 9502372382 ఫోన్ చేయాలని ఆయన కోరారు.
