Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ :
హుజురాబాద్ మండలం రాంపూర్ గ్రామంలో కాశిరెడ్డి సాయికృష్ణ (22) అనే యువకుడు శనివారం ఇంటి ఆవరణంలోనీ మరుగుదొడ్డిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తులు తెలిపారు. సాయికృష్ణకు అనారోగ్యంగా ఉండడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడి తండ్రి రాజేష్ పిర్యాదు మేరకు హుజురాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.






