Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: ఈనెల 17న దేశ రాజధాని న్యూఢిల్లీలోని రాష్టపతి భవన్ లో భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము చేతుల మీదుగా క్రీడారంగంలో అత్యున్నత పురస్కారం”అర్జున” అవార్డ్ ను స్వీకరించిన పారా ఒలింపిక్స్ పతక విజేత దీప్తి జీవాన్జీ ఆదివారం నాడు తన కోచ్, ద్రోణాచార్య నాగపురి రమేష్ ను గచ్చిబౌలిలోని ఆయన నివాసంలో కలసి దీవెనలు తీసుకున్నారు. గురువు ప్రోత్సాహంతోనే పారా ఒలంపిక్స్ లో విజేతగా నిలిచినట్లు ఈ సందర్భంగా ఆమె తెలిపారు. కాగా ఫొటోలో ఎడమనుండి కుడికి సాయిభవిష్య, డాక్టర్ అనీష, నాగపురి రమేష్, జీవాన్జీ దీప్తి, విద్యుల్లత, ఆవునూరి సమ్మయ్య కలరు.






