Oplus_131072
కుమార్ యాదవ్, స్వర్ణోదయం రిపోర్టర్ జమ్మికుంట: హుజురాబాద్ శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి 1000 కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చి గొప్పగా అభివృద్ధి చేస్తానని మాటను విస్మరించి ఈరోజు హనుమకొండ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండల కేంద్రంలో జరిగిన ప్రజా పాలన గ్రామసభలో కాంగ్రెస్ పార్టీ, ప్రజా ప్రభుత్వంను విమర్శించడం తగదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అంబాల రాజు శుక్రవారం జమ్మికుంటలో విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా అంబాల రాజు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డ సంవత్సరం కాలంలోనే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర బీసీ మరియు రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ఐటీ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుదిల్ల శ్రీధర్ బాబు, భారీ నీటిపారుదల శాఖ మరియు కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రి నలమంద ఉత్తంకుమార్ రెడ్డిల ఆధ్వర్యంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరికీ అందుతున్నాయన్నారు. ఏకకాలంలోనే రెండు లక్షల రూపాయల రుణమాఫీ, సన్నపు వడ్లకు 500 బోనస్, మహిళా సోదరీమణులకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, సబ్సిడి గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రేషన్ కార్డుతో సంబంధం లేకుండా 5 లక్షల నుండి 10 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం, ప్రభుత్వ ఉద్యోగస్తులకు వారు కోరుకున్న ప్రాంతాలకు ట్రాన్స్ఫర్స్ సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. టెట్టు పరీక్ష నిర్వహించి డీఎస్సీ ద్వారా ప్రభుత్వ టీచర్ ఉద్యోగాలు, పోలీసు మరియు గ్రూప్ వన్ గ్రూప్ టు ద్వారా అనేక నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన వాళ్లను ఆదుకున్న ఘనత కాంగ్రెస్ పార్టీకి, ప్రజా ప్రభుత్వానికి దక్కిందన్నారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వము 9 సంవత్సరాల కాలంలో బూటకపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి డబల్ బెడ్ రూమ్ లు, ఇంటికొక ఉద్యోగం, దళితులకు మూడెకరాల భూమి, దళితున్ని ముఖ్యమంత్రి, ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన ఘనత వారికే దక్కిందన్నారు. ఇప్పటికైనా హుజురాబాద్ శాసనసభ్యులు కౌశిక్ రెడ్డి ఎన్నికల సమయంలో నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన 1000 కోట్ల హామీని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర బీసీ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ఐటీ మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి కరీంనగర్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి నలమంద ఉత్తంకుమార్ రెడ్డి దగ్గరికి వెళ్లి 1000 కోట్ల రూపాయల నిధులను తీసుకువచ్చి నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడాలి తప్ప కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వాన్ని అబాస్ పాల్ చేసి గొడవలు సృష్టించి ఐదు సంవత్సరాలు కాలం వెలదీయాలని చూస్తే ఊరుకోమని ఈ సందర్భంగా హెచ్చరించారు.






