Oplus_131072
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ పట్టణంలోని మాధవ పురుషుల పొదుపు సంఘం లో సభ్యునిగా ఉంటూ అనారోగ్యంతో గత మూడు నెలల క్రితం మరణించిన నల్లగోని రవి(52) సంవత్సరాలు అనునతనికి కొడుకు మరియు నామినిగా ఉన్న నల్లగొని నవీన్ కి ఈరోజు సంఘం కార్యాలయంలో అభయ నిధి మరియు ఇన్సూరెన్స్ ప్రయోజనాలు 40 వేల రూపాయలను సంఘం అధ్యక్షుడు తొర్రి రవి, పాలకవర్గ సభ్యుల చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు పసుల స్వామి, దండగుడు అశోక్, మామునూరు ప్రవీణ్, తాoడవరం విష్ణుమూర్తి, పుల్లూరు యాదగిరి, గణకులు ప్రతాప మహేష్ తదితరులు పాల్గొన్నారు.






