
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్:
కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలో ఆదివారం నాడు గణతంత్ర దినోత్సవం వేడుకలు జరిగాయి. కరీంనగర్ లోని పోలీస్ కమిషనరేట్ కేంద్రంలోని క్వార్టర్స్ గాడ్స్ వద్ద కరీంనగర్ పోలీస్ కమీషనర్ అభిషేక్ మొహంతి ఐపీఎస్, కమీషనరేట్ పరిపాలన కార్యాలయం(సిపిఓ)వద్ద అడిషనల్ డిసిపి ఏ లక్ష్మినారాయణలు జాతీయ పతాకాలను ఎగురవేశారు.ఈ కార్యక్రమాల్లో కమీషనరేట్ లోని పోలీసు ఉన్నతాధికారులు,మినిస్ట్రీరియల్ విభాగం అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.








