
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ సంస్థ కరీంనగర్ జిల్లా వైస్ ఛైర్మెన్ గా హుజురాబాద్ కు చెందిన గాలి రాకేష్ ను నియమిస్తున్నట్లు వరల్డ్ కన్స్యూమర్ రైట్స్ సంస్థ ఫౌండర్ /ఛైర్మెన్ డా.నలమాస శ్రీకాంత్ గౌడ్ ఆదివారం హనుమకొండలో జరిగిన సమావేశంలో మెంబర్ షిప్ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… వినియోగ దారుడిని మేల్కొలిపే దిశగా పని చేయాలని, ప్రజలను అప్రమత్తం చేసేలా కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన కోరారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర కమిటీ సభ్యులకు గాలి రాకేష్ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.


గాలి రాకేష్ (పైల్)





