
Oplus_131072
స్వర్ణోదయం ప్రతినిధి, వరంగల్: వరంగల్ కమిషనరేట్ పరిధిలో సుదీర్ఘకాలం విధులు నిర్వహించి పదవీవిరమణ పొందిన పోలీస్ అధికారులు ఏసీపీ భోజరాజు, ఎస్.ఐలు సాధిక్ అలీ, రవీందర్, మధు బాబులను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ అంబర్ కిషోర్ ఝా సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ మీసేవలను నేటి తరం పోలీసులకు ఆదర్శంగా నిలుస్తాయని పదవీ విరమణ తర్వాత కూడా మీ గౌరవం తగ్గదని, ఆరోగ్యంపై శ్రద్ద వహించాలని నిత్యం వ్యాయామం కొరకు కొద్ది సమయాన్ని కేటాయించాలని పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ రవి, సురేష్ కుమార్, ఏసీపీలు నాగయ్య, సురేంద్ర, సత్యనారాయణ, ఆర్.ఐలు సతీష్, శ్రీనివాస్, స్పర్జన్ రాజ్ ఆర్.ఎస్.ఐ శ్రవణ్ తో పాటు పదవీ విరమణ చేస్తున్న పోలీస్ అధికారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
