
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మండల చేల్పూరు శివాలయంలో అంగరంగ వైభవంగా “శ్రీ విశ్వావసు నామ ఉగాది పండుగ” వేడుకలను భక్తులు జరుపుకొన్నారు. పూజారి “బస్మాంగి సాత్విక్” అయ్యగారి చేత పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించి ఉగాది పచ్చడినీ అందరికీ అందజేశారు. ఈ నూతన సంవత్సరం అందరికీ అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు, సిరి సంపదలతో శుభాలు కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చేల్పూర్ గ్రామ మాజీ సర్పంచ్ నేరెళ్ల మహేందర్ గౌడ్ మరియు సీనియర్ జర్నలిస్ట్ అనుమాస రాజేందర్, మరియు ఆర్ఎంపీ మండల అధ్యక్షుడు పంజాల తిరుపతిగౌడ్, పంజాల చందు, పంజాల సిద్ధార్థ, పంజాల నాగమణి, మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

