
మండల యాదగిరి స్వర్ణోదయం ప్రతినిధి, హుజురాబాద్: హుజురాబాద్ పట్టణ శివారులోని పరకాల క్రాస్ రోడ్ వద్ద గల 18 69 సర్వే నెంబర్ గల ప్రాంతంలో కొంత భూమి ఆక్రమణకు గురైందని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో బుధవారం అధికారులు సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హుజురాబాద్ ఆర్డిఓ రమేష్ బాబు, తాసిల్దార్ కే కనకయ్య, జిల్లా సర్వే ప్రభాకర్, ఆర్ఐ శేఖర్, రంజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సర్వే వివరాలను ఉన్నతాధికారులకు వివరించడం జరుగుతుందని వారు తెలిపారు.

భూమి కబ్జాపై మోకాను పరిశీలిస్తున్న ఆర్డీవో, తాసిల్దార్ ఇతర అధికారులు..