
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: మాటలు చెప్పడం కాదు చేతల్లో కూడా ముందు వరుసలో ఉంటారని మరోసారి రుజువు చేశారు హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్. జమ్మికుంట మండల పరిధిలోని జగ్గయ్యపల్లి గ్రామంలోని శ్రీ భక్తఆంజనేయస్వామి దేవాలయానికి వచ్చినప్పుడు బోర్ మోటార్ పాడైందని సభ్యులు వివరించగా ఇచ్చిన మాట ప్రకారం జగ్గయ్యపల్లి గ్రామంలోని శ్రీ భక్త ఆంజనేయస్వామి దేవాలయానికి బోర్ మోటార్ ఇప్పించారు ప్రణవ్. దీని పట్ల హర్షం వ్యక్తం చేశారు ఆలయ కమిటీ సభ్యులు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ నాయినేని రాజేశ్వర్ రావు, గ్రామ శాఖ అధ్యక్షుడు బాపురావ్, ఆలయ కమిటీ చైర్మన్ దుగ్గినాల రవీందర్, గౌరవ అధ్యక్షుడు ప్రభాకర్ రావు, వైస్ చైర్మన్ తూముల తిరుపతిరావు, కోశాధికారి రాజు,సభ్యులు పొనగంటి రాజేశ్వర్ రావు, ఆవిరినేని రవీందర్ రావు, నాయినేని రాజేశ్వర్ రావు, కంకట రాజశేఖర్, ముక్కిడి మహేందర్, గుజ్జ కిరణ్ రావు, వెంగల్ రావు, రాజేశ్వర్ రావు, లింగంపల్లి రాజు, గాజ రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.



