
– ఏళ్ళుగా పరిష్కారం కానీ పనులకు మోక్షం.
– ఓట్ల రాజకీయం కోసం దళితులను వాడుకున్నారు.
– దళిత బంధు నిధులను అడ్డుకున్నది కౌశిక్ రెడ్డే..
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని పదవి ఉన్నా లేకపోయినా రాజకీయాల కంటే హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధికే విలువ ఇస్తానని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. శనివారం రోజున హుజురాబాద్ పట్టణంలోని హై స్కూల్ మైదానంలో వాకింగ్ చేసే వాకర్స్ కి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు పది లక్షల విలువ చేసే వాకింగ్ ట్రాక్ ,గేట్ పనులను ఆయన కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏళ్ళుగా ఎదురుచూస్తున్న పనులకు మోక్షం లభిస్తుందని, కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని మరోసారి రుజువు అయిందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి, జిల్లాకు సంబంధించిన మంత్రుల సహకారంతో మరిన్ని నిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తామని,10నెలల క్రితం ఇక్కడికి వచ్చినప్పుడు ఇచ్చిన మాట ప్రకారం ఇప్పుడు ప్రారంభించామని,రాజకీయాలకు అతీతంగా హుజురాబాద్ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
దళిత ద్రోహి కౌశిక్ రెడ్డి..ప్రణవ్
దళిత బంధు విషయంలో మొసలి కన్నీరు కారుస్తున్న కౌశిక్ రెడ్డి దళిత ద్రోహి అని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ అన్నారు.గతంలో చెప్పినట్టుగా చంపినోడే సంతాపం తెలిపినట్టు దళిత బంధు నిధులను అడ్డుకున్నది కౌశిక్ రెడ్డే అని,ఓట్ల కోసం తప్ప దళితుల అభ్యున్నతికి ఏ రోజు పాటు పడలేదని అన్నారు.కౌశిక్ రెడ్డి విషయంలో ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారని తను సోషల్ మీడియాలో రీల్స్ చేసుకునే ఎమ్మెల్యే తప్ప ప్రజలు కష్టాలు తీర్చే ఎమ్మెల్యే కాదని అన్నారు.దళితుల పట్ల నిజమైన ప్రేమ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని అన్నారు.దళిత బంధు పథకం విషయంలో లబ్ధిదారులు ఆందోళన చెందాల్సిన్ అవసరం లేదని నిధుల ప్రక్రియ ప్రారంభం ఆయిందని,ఎలాంటి కమీషన్ లకు తావు లేకుండా పకడ్బందీగా అర్హులైన ప్రతి ఒక్కరికి పథకం అందజేస్తామని అన్నారు.
అభివృద్ధి పథకాలే మాకు శ్రీరామ రక్ష..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టామని 200 యూనిట్ల ఉచిత విద్యుత్,ఇందిరమ్మ ఇళ్లు,రేషన్ కార్డులు లాంటి ప్రభుత్వ పథకాలే మాకు రక్షగా ఉంటాయని ప్రణవ్ అన్నారు.చిల్లర ఆరోపణలు చేసే ముందు నియోజక వర్గంలో ఒక్క ఇల్లు అయినా పేదలకు ఇచ్చారా అని ప్రశ్నించారు.ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని ప్రభుత్వం ప్రవేశ పెట్టే పథకాలు ప్రజలకు అందేలాగ నా వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వాకింగ్ అసోసియేషన్ అధ్యక్షులు, మాజీ అధ్యక్షులు, వాకర్స్, వ్యవసాయ మార్కెట్ చైర్మెన్, హనుమాన్ దేవాలయ చైర్మెన్, కాంగ్రెస్ పార్టీ మండల,పట్టణ అధ్యక్షులు,మహిళా అధ్యక్షురాలు, పార్టీ సీనియర్ నాయకులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సెల్ అధ్యక్షులు, మైనారిటీ, సేవాదళ్ సెల్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


కొబ్బరికాయ కొట్టి వాకింగ్ ట్రాకుకు భూమి పూజ చేస్తున్న ప్రణవ్..

భూమి పూజ వద్ద వాకర్స్, అతిథులు..

మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, ఏఈ సాంబరాజు ను వివరాలు అడిగి తెలుసుకుంటున్న ప్రణవ్ బాబు