
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ మున్సిపల్ పరిధిలోని ఐదవ ఏడవ వార్డుల్లో సోమవారం మున్సిపల్ ఆధ్వర్యంలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమం నిర్వహించినట్లు మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య తెలిపారు. రెండు వార్డుల్లో ఉన్న బతుకమ్మ సౌల్లు, చిలుకవాగుల వద్ద రోడ్లకు ఇరువైపులా పెరిగిన గడ్డి మొక్కలను, చెత్తా చెదారమును జంగిల్ క్లియరెన్స్ చేశారు. రోడ్లకు అడ్డుగా పెరిగిన చెట్లను ట్రిమ్మింగ్ చేయడం చేసి, చిలుకవాగు లో నీరు వెళ్ళకుండా అడ్డుగా పెరిగిన గడ్డి మొక్కలను తుమ్మ చెట్లను, చెత్త చెదారాన్ని జెసిబి యంత్రంతో తీసివేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ ఎన్. సుధాకర్ ,రవీందర్, రాజయ్య , ఎన్విరాన్ మెంటల్ ఇంజనీర్ పి. వినయ్ , సానిటరీ జవాన్లు రోంటాల సుధీర్ , ప్రతాప రాజు, ఆరెల్లి రమేష్, టి. కుమారస్వామి , పి అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.




