
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ (జమ్మికుంట) జులై 17: కరీంనగర్ జిల్లా కళాభారతిలో దివ్యాంగుల మహాగర్జన సన్నాహ క సదస్సు కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుల పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ కి దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలని మెమోరాండం ఇవ్వడం జరిగింది.
1) ప్రతి నెల ఒకటో తారీకున పెన్షన్ ఇవ్వాలి
2) హామీ ఇచ్చిన రెండు వేల పెన్షన్ పెంచి 6000 ఇవ్వాలి
3)మంచానికి పరిమితమైన దివ్యాంగులకు 15000 రూపాయల పెన్షన్ ఇవ్వాలి
4) సికిల్ సెల్ ఎనీమియా ఉన్నవారికి పదివేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలి
5) డయాలసిస్ పేషంట్ వారికి పదివేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలి
6) దివ్యాంగుల బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయించాలి
7) దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి
8) మంచానికి పరిమితమైన వారికి పర్మనెంట్ సదరం సర్టిఫికేట్ ఇవ్వాలి
ఈ కార్యక్రమంలో క్యాడర్ రాష్ట్రస్థాయి ఉపాధ్యక్షులు నేరుపటి రవి ,మండల ప్రెసిడెంట్ శనిగరావు రమేష్, ట్రెజరర్ ముత్యాల రంగయ్య ఇల్లందకుంట మండల శాఖ ప్రెసిడెంట్ చేరాల వైకుంఠం , సంఘం సభ్యులు దాసరి రఘుపతి వరికుప్పల శోభ పాల్గొన్నారు

మందకృష్ణ మాదిగకు వినతి పత్రం అందజేస్తున్న క్యాడర్ రాష్ట్రస్థాయి ఉపాధ్యక్షులు నేరుపటి రవి ,మండల ప్రెసిడెంట్ శనిగరావు రమేష్, ట్రెజరర్ ముత్యాల రంగయ్య ఇల్లందకుంట మండల శాఖ ప్రెసిడెంట్ చేరాల వైకుంఠం , సంఘం సభ్యులు దాసరి రఘుపతి వరికుప్పల శోభ

మందకృష్ణ మాదిగ సమావేశంకు హాజరైన జమ్మికుంట నాయకులు
————————-+++++++++——————
&పత్రికా ప్రకటనలు (యాడ్స్)&
———————+++++++±——————-
@వార్షికోత్సవ శుభాకాంక్షలు@






