
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: జమ్మికుంట మండలం శాయంపేట మాజీ సర్పంచ్ యామ రవీందర్ తండ్రి యామ నర్సయ్య ఇటీవల గుండెపోటుతో మృతిచెందగా వారి కుటుంబాన్ని కేడీసీసీ బ్యాంక్ వైస్ చైర్మన్ పింగిలి రమేష్ ఆదివారం పరామర్శించారు. నరసయ్య మృతి గురించి పలు వివరాలను అడిగి తెలుసుకునీ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. కేడీసీసీ వైస్ చైర్మన్ వెంట నియోజకవర్గ బిఆర్ఎస్ యూత్ ఇంచార్జ్ జోడు కుమారస్వామి, అఖిల్, రాకేష్, వినోద్, సాగర్ తో పాటు తదితరులు ఉన్నారు.







