
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్:
హుజురాబాద్ పట్టణంలోని శ్రీ వాగ్దేవి డిగ్రీ కళాశాలలో సోమవారం ఆరంబ్ ఉత్సవాలు విద్యార్థుల ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సైకాలజిస్ట్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. విద్యార్థులు తల్లిదండ్రుల కలలని సాకారం చేయాలని అన్నారు. కమిషనర్ కే సమ్మయ్య మాట్లాడుతూ…చదువుపైనే మనసు లగ్నం చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు అని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ ఏనుగు మహిపాల్ రెడ్డి, అడ్వైజర్ పోరెడ్డి శంతన్ రెడ్డి, ప్రిన్సిపాల్ బి ప్రవీణ్ రెడ్డి, వేణుమాధవ్, దాసరి కోటేశ్వర్ యాదవ్, అధ్యాపకులు భద్రయ్య కొలిపాక రమేష్ మేకల నవీన్ కుమార్, వేముల శ్రీనివాస్, సురేష్, సంపత్, వెంకటేష్ వేణు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.




ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు..






