Oplus_16908288
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ లోని విద్యుత్ సబ్ స్టేషన్ మరమ్మత్తుల దృష్ట్యా ఈనెల 11వ తేదీ శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని హుజురాబాద్ ట్రాన్స్ కో ఏఈ ఎం శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. శనివారం ఉదయం 09:30 గంటల నుండి 11:30 గంటల వరకు హుజురాబాద్ పట్టణం మొత్తం విద్యుత్ సరఫరా నిలిపి వేయబడునని, ప్రజలకు కలుగుతున్న ఆసౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకొని సహకరించాలని ఆయన కోరారు.





