
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్ :
హుజురాబాద్ మండలం సింగాపూర్ గ్రామంలో నిర్మిస్తున్న నూతన హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణ పనులను శుక్రవారం హుజురాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఒడితల ప్రణవ్ బాబు సందర్శించి పరిశీలించారు.
20 లక్షల రూపాయల వ్యయంతో నిర్మాణం అవుతున్న హెల్త్ సబ్ సెంటర్ పనుల పురోగతిపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. వైద్యరంగ విషయంలో ప్రభుత్వం చిత్తశుద్దిగా ఉందని, మరిన్ని నిధులు కేటాయించి హుజూరాబాద్ లోని హాస్పిటల్స్ ను అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.



హెల్త్ సెంటర్ ను నిర్మాణ పనులను పరిశీలిస్తున్న కాంగ్రెస్ నేత ప్రణవ్..





