
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి కరీంనగర్: మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తండ్రి కీ.శే.సత్యనారాయణరావు ఇటీవలే మృతి చెందగా రైతు ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు హైదరాబాద్ లోని కోకాపేటలోని వారి నివాసంలో హరీశ్ రావును వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుడు సత్యనారాయణరావు చిత్ర పటానికి పుష్పాభిషేఖం చేసి రామారావు ఘనంగా నివాళులు అర్పించారు.









