
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి హుజురాబాద్: హుజురాబాద్ లోనీ గవర్నమెంట్ హైస్కూల్ లో మాథ్స్ టీచర్ గా చాలా కాలం పనిచేసిన పచిక ఉపేందర్ రెడ్డి (Retd మాథ్స్ టీచర్) ఈరోజు మంగళవారం మధ్యాహ్నం హైదరాబాద్ లో మృతి చెందినట్లు ఉపాధ్యాయ వర్గాల ద్వారా తెలిసింది.
వీరు గవర్నమెంట్ హైస్కూల్ మాథ్స్ టీచర్ గా చాలా కాలం పనిచేసి హుజురాబాద్ ప్రాంతములో మంచి మాథ్స్ టీచర్ గా పేరు పొందినారు. అనేక మంది విద్యార్థులకు అభిమాన టీచర్ గా ఆరాధించబడినారు. సర్వీస్ చివరి కాలములో హన్మకొండ లో రిటైర్డ్ అయినారు. అంత్యక్రియలు రేపు మధ్యాహ్నము హనుమకొండలో జరుగునని కుటుంబ సభ్యులు తెలిపినారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చాలని భగవంతున్ని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు పలు ఉపాధ్యాయ సంఘాల నాయకుడు, ఆయన శిష్యులు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

పచిక ఉపేందర్ రెడ్డి (ఫైల్ ఫోటో)





