Oplus_16908288
–17 సంవత్సరాల బాలికపై ఆల్కహాల్ తాగించి అత్యాచారం!?
–మొయినాబాద్ ఫామ్ హౌజ్ తో పాటు మరో రెండు ప్రాంతాల్లో జరిగినట్టు సమాచారం
–రెండు సార్లు ఆత్మహత్యకు ప్రయత్నించిన బాలిక!
–నిన్న అర్ధరాత్రి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో 6 గంటల హైడ్రామా!
–మొత్తానికి కంప్లైంట్ తీసుకున్న పోలీసులు, ఇంకా నమోదుకాని FIR…
–FIR కాకుండా బండి సంజయ్ విశ్వప్రయత్నం రేవంత్ , డీజీపీ టేబుల్ ముందు పంచాయతీ..
-కేసు పెట్టకపోతే కోర్టుకు వెళ్తామంటున్న బాలిక తల్లితండ్రులు
స్వర్ణోదయం ప్రతినిధి, హైదరాబాద్:
కేంద్ర మంత్రి కొడుకైతే పోక్సో కేసు పెట్టరా!? FIR నమోదు చేయరా!? అంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ మంత్రిని కాపాడుతోందా? అని విమర్శిస్తున్నారు. గతంలో ఉత్తరప్రదేశ్ లో కూడా సంజయ్ కొడుకుపై కేసులు నమోదైనట్టు ఆరోపణలు రాగా అప్పట్లో మహీంద్రా యూనివర్సిటీలో తోటి విద్యార్థిపై దాడి చేసింది కూడా బండి కొడుకే అని గతంలో ఆరోపణలు వచ్చాయి. ఏదిఏమైనాప్పటికీ కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ కుమారుడు భగీరథ పై కేసు నమోదు చేసి అన్ని రకాలుగా విచారణ జరుపుతున్నట్లుగా పోలీసు ఉన్నతాధికారుల ద్వారా తెలుస్తుంది.





