
మండల యాదగిరి, స్వర్ణోదయం ప్రతినిధి:
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని కాటాపురంలో గల 3వ అంగన్ వాడి సెంటర్ లో రడం సుజాత అనే మహిళ అంగన్వాడి టీచర్ గా పనిచేస్తోంది. ఈ క్రమంలో బుధవారం ఉదయం అమె కాటాపురం గ్రామ శివారులో ఓ చెట్టు కింద శవమై పడివుంది. ఆమెను గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేశారని పలువురు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించి విచారణ ప్రారంభించారు.